NASA స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ‘క్రూ-3’.. మిషన్ కమాండర్‌గా హైదరాబాదీ

ABN , First Publish Date - 2021-11-11T22:44:06+05:30 IST

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, స్పేస్ ఎక్స్ కంపెనీ సంయుక్తంగా ప్రయోగించిన ‘క్రూ-3’ మిషన్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఫాల్కన్ 9 రాకెట్‌లో నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) బయల్దేరి వెళ్లగా.. ఇందులో

NASA స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ‘క్రూ-3’.. మిషన్ కమాండర్‌గా హైదరాబాదీ

ఎన్నారై డెస్క్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, స్పేస్ ఎక్స్ కంపెనీ సంయుక్తంగా ప్రయోగించిన ‘క్రూ-3’ మిషన్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఫాల్కన్ 9 రాకెట్‌లో నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) బయల్దేరి వెళ్లగా.. ఇందులో తెలంగాణకు చెందిన వ్యక్తి కూడా ఉన్నారు. ఈ మిషన్‌కు ఆయన కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. 


అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం రాత్రి 9 గంటలకు ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా ఐఎస్ఎస్‌కు బయల్దేరిన వ్యోమగాములు.. సుమారు 22 గంటల తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోనున్నారు. అమెరికా నేవీ సబ్‌మెరైన్ అధికారి కేలా బారన్.. ఈ మిషన్‌కు స్పెషలిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. నాసాకు చెందిన టామ్ మార్ష్‌బర్న్ పైలట్‌గా, ఐరోపా అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన మత్తియాస్ మౌరర్ మిషన్ స్పెషలిస్ట్‌గా అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. వీరితో పాటే తెలంగాణకు చెందిన రాజాచారి ఐఎస్ఎస్‌కు బయల్దేరి వెళ్లగా.. ఆయన ఈ మిషన్‌కు కమాండర్‌గా వ్యవరిస్తున్నారు. కాగా.. రాజాచారి సహా మరోముగ్గరు వ్యోమగాములు ఆరు నెలలపాటు అంతరిక్ష కేంద్రంలో ఉండనున్నారు. 



రాజాచారి తండ్రి శ్రీనివాస్ వి. చారి హైదరాబాద్ నుంచి అమెరికాకు ఉద్యోగం కోసం వలస వెళ్లారు. అక్కడ అమెరికాకు చెందిన పెగ్గీ ఎగ్బర్ట్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో 1977లో వారికి రాజాచారి జన్మించారు. యూఎస్ ఎయిర్ ఫోర్స్‌ అకాడమీలో ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్‌లో రాజాచారి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత మసాచు సెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆస్ట్రోనాటిక్స్, ఏరోనాటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదివారు. 2017లో నాసా ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ క్లాస్‌‌కు ఆయన ఎంపికయ్యారు. రాజాచారికి ఇదే తొలి అంతరిక్ష ప్రయాణం కాగా..  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అర్టెమిస్’ మిషన్‌కు 18 మంది వ్యోమగాముల బృందాన్ని నాసా ఎంపిక చేసింది. ఇందులో రాజాచారి కూడా ఉన్నారు. 


Updated Date - 2021-11-11T22:44:06+05:30 IST