Kuwait లో ప్రవాస భారతీయుడు మృతి

ABN , First Publish Date - 2022-04-23T14:46:30+05:30 IST

కువైత్‌లో ఓ ప్రవాస భారతీయుడు మృతి చెందాడు.

Kuwait లో ప్రవాస భారతీయుడు మృతి

కువైత్ సిటీ: కువైత్‌లో ఓ ప్రవాస భారతీయుడు మృతి చెందాడు. అక్కడి సభా చెస్ట్ ఆస్పత్రిలో సెల్వరాజ్(59) అనే భారత వ్యక్తి శుక్రవారం చనిపోయాడు. అనారోగ్యంగా ఉండడంతో సెల్వరాజ్‌ను కుటుంబ సభ్యులు సభా ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, తమిళనాడుకు చెందిన సెల్వరాజ్ గత పాతికేళ్లుగా కువైత్‌లో రెస్టారెంట్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మంగాఫ్ బ్లాక్-4లో అతడికి చెందిన కీర్తి రెస్టారెంట్ ఉంది. సెల్వరాజ్‌కు భార్య సావిత్రి, పిల్లలు గోపిక, కీర్తి, విష్ణు ఉన్నారు. అతడి హఠాన్మరణంతో భార్య పిల్లలు కన్నీరుమున్నీరు అవుతున్నారు. బంధువులు, స్నేహితులు సెల్వరాజ్ మృతిపట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.     

Updated Date - 2022-04-23T14:46:30+05:30 IST