కువైట్‌లో కరోనా కాటుకు కేరళ మహిళ మృతి

ABN , First Publish Date - 2021-02-26T04:23:02+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభణ కువైట్‌లో కొనసాగుతోంది. ఈ క్రమంలో 53ఏళ్ల భారత మహిళ కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆమె భర్త కూడా ప్రస్తుతం కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్నారు. వివరాల్లోకి

కువైట్‌లో కరోనా కాటుకు కేరళ మహిళ మృతి

కువైట్: కరోనా మహమ్మారి విజృంభణ కువైట్‌లో కొనసాగుతోంది. ఈ క్రమంలో 53ఏళ్ల భారత మహిళ కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆమె భర్త కూడా ప్రస్తుతం కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన సౌదా సాగీర్(53) కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను స్థానికంగా ఉన్న హాస్పిటల్‌లో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు కువైట్ మీడియా వెల్లడించింది. కాగా.. ఆమె భర్త.. సాగీర్ త్రికైప్పూర్ కూడా కొద్ది రోజుల క్రితం మహమ్మారి బారినపడ్డారు. జాబర్ హాస్పిటల్‌లో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కువైట్ కేరళ ముస్లిం అసోసియేషన్‌కు సాగీర్ త్రికైప్పూర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 


Updated Date - 2021-02-26T04:23:02+05:30 IST