నేపాల్ పోలీసుల కాల్పుల్లో భారతీయుడి మృతి

ABN , First Publish Date - 2021-03-05T15:20:20+05:30 IST

ఇండో-నేపాల్ సరిహద్దుల్లో నేపాల్ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ భారత పౌరుడు మరణించారు....

నేపాల్ పోలీసుల కాల్పుల్లో భారతీయుడి మృతి

ఫిలిభిత్ (ఉత్తరప్రదేశ్): ఇండో-నేపాల్ సరిహద్దుల్లో నేపాల్ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ భారత పౌరుడు మరణించారు.గోవిందా అనే 26 ఏళ్ల యువకుడు పప్పూ యాదవ్, గుర్మిత్ సింగ్‌లతో కలిసి నేపాల్ వెళ్లాడు. నేపాల్ పోలీసులతో భారత యువకుడికి వాగ్వాదం జరిగింది. దీంతో నేపాల్ పోలీసులు జరిపిన కాల్పుల్లో గోవిందా తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన గోవిందాను ఆసుపత్రికి తరలించగా మరణించాయని ఫిలిభిత్ జిల్లా ఎస్పీ జయప్రకాష్ చెప్పారు. గోవిందాతో నేపాల్ వెళ్లిన ఒకరు తప్పించుకొని భారత్ సరిహద్దుకు వచ్చాడు. మరో వ్యక్తి ఆచూకీ లేకుండా పోయాడు. నేపాల్ పోలీసుల కాల్పులతో ఇండో-నేపాల్ సరిహద్దుల్లో ఉద్రిక్తవాతావరణం నెలకొంది.


Updated Date - 2021-03-05T15:20:20+05:30 IST