తోటి మహిళను పొడిచి చంపిన భారత వ్యక్తి.. కువైట్‌లో..

ABN , First Publish Date - 2021-03-05T14:13:57+05:30 IST

కువైట్‌లో దారుణం జరిగింది. గ్యాస్ సీలిండర్ విషయమై జరిగిన గొడవలో భారత వ్యక్తి తోటి మహిళను కత్తితో పొడిచి చంపేశాడు.

తోటి మహిళను పొడిచి చంపిన భారత వ్యక్తి.. కువైట్‌లో..

కువైట్ సిటీ: కువైట్‌లో దారుణం జరిగింది. గ్యాస్ సీలిండర్ విషయమై జరిగిన గొడవలో భారత వ్యక్తి తోటి మహిళను కత్తితో పొడిచి చంపేశాడు. కువైట్‌లోని అల్ రుమైతియా‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే ఓ భారతీయ కుటుంబంతో సదరు యువకుడు కలిసి ఉంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో గ్యాస్ సీలిండర్ విషయమై తలెత్తిన ఘర్షణతో కోపోద్రిక్తుడైన యువకుడు.. మహిళను పలుమార్లు కత్తితో పొడిచేశాడు. యువకుడి దాడితో తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే చనిపోయింది. కాగా, మృతురాలి పేరు, ఈ ఘాతుకానికి పాల్పడిన యువకుడి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక 4.7 మిలియన్ల జనాభా గల కువైట్‌లో సుమారు మిలియన్ మంది వరకు భారతీయులు ఉన్నారని సమాచారం.   

Updated Date - 2021-03-05T14:13:57+05:30 IST