హాకీ ప్లేయర్ మన్‌దీప్‌ ఆసుపత్రికి తరలింపు

ABN , First Publish Date - 2020-08-11T22:39:29+05:30 IST

భారత హాకీ ఆటగాడు మన్‌దీప్‌ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌..

హాకీ ప్లేయర్ మన్‌దీప్‌ ఆసుపత్రికి తరలింపు

న్యూఢిల్లీ: భారత హాకీ ఆటగాడు మన్‌దీప్‌ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స పొందుతున్నాడు. అయితే సోమవారం రాత్రి మన్‌దీప్ రక్తంలో ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు భారత క్రీడా సమాఖ్య వెల్లడించింది. ప్రస్తుతం మన్‌దీప్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, భయపడాల్సిందేమీ లేదని తెలిపింది. ఇదిలా ఉంటే మన్‌దీప్‌తో కలిపి ఇప్పటి వరకు ఆరుగురు భారత హాకీ ఆటగాళ్లకు కరోనా సోకింది. వారిలో జాతీయ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, సురేందర్ కుమార్, జస్కరన్ సింగ్, వరున్ కుమార్, కృష్ణ బీ పాఠక్ ఉన్నారు.

Updated Date - 2020-08-11T22:39:29+05:30 IST