అమెరికాలో భారతీయ విద్యార్థి దుర్మరణం.. బంతి కోసం చెరువులో దిగి..

ABN , First Publish Date - 2022-04-26T01:50:08+05:30 IST

అమెరికాలో ఓ భారతీయ విద్యార్థి ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం చెరువులో పడిన బంతిని వెలికి తీసేందుకు వెళ్లిన క్లింటనె జీ అజిత్(18) నీళ్లలో మునిగిపోయాడు. న్యూజెర్సీలోని న్యూమిల్ఫోర్డ్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

అమెరికాలో భారతీయ విద్యార్థి దుర్మరణం.. బంతి కోసం చెరువులో దిగి..

ఎన్నారై డెస్క్: అమెరికాలో ఓ భారతీయ విద్యార్థి ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం చెరువులో పడిన బంతిని వెలికి తీసేందుకు వెళ్లిన క్లింటనె జీ అజిత్(18) నీళ్లలో మునిగిపోయాడు. న్యూజెర్సీలోని న్యూమిల్ఫోర్డ్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.  ‘‘మొదట అతడి నడుము వరకూ నీళ్లు వచ్చేశాయి. ఆ తరువాత.. భుజాల వరకూ మునిగిపోయాడు. చూస్తుండగానే నీటిలో మునిగిపోయాడు’’ అని అతడి స్నేహితుడొకరు తెలిపారు. కాగా.. ఘటన తాలూకు సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. మరో మూడు గంటల తరువాత మృతదేహాన్ని వెలికి తీశారు. కాగా.. ఈ ఘటనతో అజిత్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. 

Updated Date - 2022-04-26T01:50:08+05:30 IST