భారత్ వరుడు... నేపాలీ వధువు... 12 నిముషాల్లో పెళ్లి!
ABN , First Publish Date - 2020-07-15T16:54:24+05:30 IST
ఆ జంట వివాహంతో ఒక్కటయ్యేందుకు ఇండో-నేపాల్ పరిపాలనా యంత్రాంగాలు 15 నిమిషాల పాటు అంతర్జాతీయ వంతెనను తెరిచాయి.
న్యూఢిల్లీ: ఆ జంట వివాహంతో ఒక్కటయ్యేందుకు ఇండో-నేపాల్ పరిపాలనా యంత్రాంగాలు 15 నిమిషాల పాటు అంతర్జాతీయ వంతెనను తెరిచాయి. పెళ్లి ఊరేగింపు లేకుండానే వరుడు తన తండ్రితో కలిసి నేపాల్లోని దర్చులాలో జరిగే తమ వివాహ వేడుకకు హాజరయ్యాడు. సాధారణంగా హిందూ వివాహాలు ఆరు నుండి ఏడు గంటల పాటు జరుగుతాయి. అయితే వీరి వివాహం కేవలం 12 నిమిషాల్లో ముగిసింది. నేపాల్ పరిపాలనా విభాగం అనుమతితో భారత్లోని పిథోరాగఢ్కు చెందిన కమలేష్ చంద్ తన వివాహం కోసం నేపాల్లోని దర్చులాకు చేరుకున్నాడు. పెళ్లికి వరుడు, అతని తండ్రి మాత్రమే హాజరయ్యారు. ప్రభుత్వ అనుమతి మేరకు 15 నిముషాల పాటు ఝూలాపూల్ తెరిచారు. దర్చులాలో వరుడు, వధువు దండలు మార్చుకున్నారు. వెంటనే ఆ కొత్త దంపతులు భారత్కు తిరిగి వచ్చారు. కాగా మార్చి 22న వీరి వివాహం జరగాల్సివుంది. అయితే లాక్డౌన్ కారణంగా పెళ్లి వాయిదా పడింది.