Indian Expat: ఇద్దరు పిల్లల తల్లి.. కేవలం రూ.4వేల షాపింగ్ చేసి.. రూ.2కోట్లు గెలుచుకుంది.. ఎక్కడంటే..

ABN , First Publish Date - 2022-08-14T16:03:21+05:30 IST

ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్తతో కలిసి అబుధాబిలో నివాసం ఉంటున్నారు. ఆ మహిళను తాజాగా అదృష్టం వరించింది. కేవలం రూ.4వేల షాపింగ్ చేసి.. రూ.2కోట్లు గెటుచుకున్నారు. ఈ క్రమంలో ఆమెతోపాటు కుటుంబ సభ్యులు ఆనందంతో ఉబ్బిత

Indian Expat: ఇద్దరు పిల్లల తల్లి.. కేవలం రూ.4వేల షాపింగ్ చేసి.. రూ.2కోట్లు గెలుచుకుంది.. ఎక్కడంటే..

ఎన్నారై డెస్క్: ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్తతో కలిసి అబుధాబిలో నివాసం ఉంటున్నారు. ఆ మహిళను తాజాగా అదృష్టం వరించింది. కేవలం రూ.4వేల షాపింగ్ చేసి.. రూ.2కోట్లు గెటుచుకున్నారు. ఈ క్రమంలో ఆమెతోపాటు కుటుంబ సభ్యులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పోతున్నారు. కాగా.. ఇంతకూ ఆమె ఎవరు? కేవలం నాలుగు వేల రూపాయలతో అంత పెద్ద మొత్తాన్ని ఎలా గెలుచుకున్నారు? అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై లులు గ్రూప్ సంస్థల అధినేత ఎం.ఏ యూసుఫ్ అలీకి సంబంధించిన షాపింగ్స్ మాల్స్ యూఏఈ(UAE) వ్యాప్తంగా అనేకం ఉన్నాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే.. అబుధాబిలో లులు మాల్స్( LuLu malls in Abu Dhabi) పేరుతో ఉన్న షాపింగ్ మాల్స్‌.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్ట్ మొదటి వారం వరకు ‘మాల్ మిలియనీర్’ క్యాంపెయిన్‌ను (Mall Millionaire campaign). నిర్వహించాయి. 200 దిర్హమ్‌లు అంటే సుమారు రూ.4,335 ఖర్చు చేసి.. ఈ క్యాంపెయిన్‌లో పాల్గొన్న కస్టమర్లకు.. లక్కీ డ్రాలో ఒక మిలియన్ దిర్హమ్‌లను గెలుచుకునే అవకాశం కల్పించాయి.



ఈ నేపథ్యంలోనే భర్త, పిల్లలతోపాటు అబుధాబిలో నివసిస్తున్న తమిళనాడుకు చెందిన సెల్వరాణి డేనియల్ జోసెఫ్(Selvarani Deniel Joseph).. ఈ క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. కాగా.. తాజాగా నిర్వహించిన డ్రాలో ఆమెకు లభించిన కూపన్‌కు నెంబర్‌కు జాక్‌పాట్ తగిలింది. ఏకంగా 1 మిలియన్ దిర్హమ్‌లు (దాదాపు 2.16కోట్లు) గెలుచుకున్నారు. ఈ విషయం తెలిసి ఆమె భర్త సహా ఇతర కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సెల్వరాణి కొద్ది రోజుల క్రితం తన స్వగ్రామానికి వచ్చినందువల్ల.. ఆమె భర్త ఆ మొత్తానికి సంబంధించిన చెక్‌ను అందుకున్నారు. 


Updated Date - 2022-08-14T16:03:21+05:30 IST