భారతీయుడికి జాక్‌పాట్.. ఒక్క టికెట్‌తో కోటీశ్వరుడయ్యాడు!

ABN , First Publish Date - 2021-03-04T06:42:44+05:30 IST

షార్జాలో నివసిస్తున్న భారతీయుడికి అబుధాబి బిగ్ టికెట్ లాటరీలో జాక్‌పాట్ తగిలింది. దీంతో కోట్లు గెలుచుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కర్నాటకకు చెందిన శివమూర్తి కృష్ణప్ప 2005లో యూఏఈ వెళ్లి, అక్కడ ఓ సం

భారతీయుడికి జాక్‌పాట్.. ఒక్క టికెట్‌తో కోటీశ్వరుడయ్యాడు!

దుబాయి: షార్జాలో నివసిస్తున్న భారతీయుడికి అబుధాబి బిగ్ టికెట్ లాటరీలో జాక్‌పాట్ తగిలింది. దీంతో కోట్లు గెలుచుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కర్నాటకకు చెందిన శివమూర్తి కృష్ణప్ప 2005లో యూఏఈ వెళ్లి, అక్కడ ఓ సంస్థలో మెకానికల్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్నేళ్లుగా ఆయన లాటరీ టికెట్ కొంటూ వస్తున్నారు. అయితే ప్రతిసారి శివమూర్తి కృష్ణప్పకు నిరాశే ఎదురైంది. కానీ ఈ ఏడాది 17న కొన్న 202511 అనే నెంబర్ గల టికెట్ ఆయనకు 12మిలియన్ దిర్హమ్‌లను (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 23.85కోట్లు) తెచ్చి పెట్టింది.


దీంతో ఆయన సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ మొదట్లో స్నేహితులతో కలిసి ఉమ్మడిగా లాటరీ టికెట్‌ను కొనేవాడిని. కానీ గత ఏడాది నుంచి సొంతంగా నేనే టికెట్‌ను కొనుగోలు చేస్తున్నాను. రెగ్యులర్‌గా కొనేవాళ్లకు లాటరీ నిర్వాహకులు ప్రత్యేక ఆఫర్ ఇవ్వడంతో గత నెలలో రెండు టికెట్లను కొనుగోలు చేశాను. లాటరీ డ్రాలో ఇంత డబ్బును గెలుచుకున్నాననే విషయాన్ని మొదట్లో నమ్మలేకపోయాను. ఈ డబ్బుతో స్వగ్రామంలో మంచి ఇల్లు కట్టుకుంటాను. మిగిలిన డబ్బులో ఎక్కువ మొత్తాన్ని నా ఇద్దరి పిల్లల పేరుపై డిపాజిట్ చేస్తాను’ అని పేర్కొన్నారు. 


Updated Date - 2021-03-04T06:42:44+05:30 IST