ప్రమాదవశాత్తు అబుధాబిలో భారతీయుడు మృతి

ABN , First Publish Date - 2021-08-09T15:45:10+05:30 IST

యూఏఈలో ప్రమాదవశాత్తు ప్రవాస భారతీయుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేరళకు చెందిన 37ఏళ్ల రఫీద్ మసూద్ అబుధాబిలోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ముస్సాఫ్ ఇం

ప్రమాదవశాత్తు అబుధాబిలో భారతీయుడు మృతి

అబుధాబి: యూఏఈలో ప్రమాదవశాత్తు ప్రవాస భారతీయుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేరళకు చెందిన 37ఏళ్ల రఫీద్ మసూద్ అబుధాబిలోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ముస్సాఫ్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఉంటున్నాడు. శుక్రవారం రోజు మసూద్ మధ్యాహ్నభోజంన చేస్తుండగా తాను ఉన్న బిల్డింగ్‌లో ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మసూద్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బిల్డింగ్‌లోని మొదటి అంతస్థులోని ఏసీలో షాట్ సర్క్యూట్ అయ్యిందని, అందువల్లే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమిక విచారణలో తేల్చారు. కాగా.. మసూద్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించనున్నట్టు కంపెనీ యజమాని పేర్కొన్నారు. 


Updated Date - 2021-08-09T15:45:10+05:30 IST