కువైట్లో భారతీయుడి బలవన్మరణం !
ABN , First Publish Date - 2020-06-02T18:02:05+05:30 IST
కువైట్లో ఓ భారత ప్రవాసీయుడు సోమవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కువైట్ సిటీ: కువైట్లో ఓ భారత ప్రవాసీయుడు సోమవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. కువైట్లోని సలిహియా ప్రాంతంలో గల ఓ టవర్లోని 29వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, మృతుడిని పోలీసులు ఆ టవర్లోనే పని చేసే టెక్నీషియన్గా గుర్తించారు. ప్రాథమిక విచారణ అనంతరం ఈ ఘటనను కువైట్ పోలీసులు ఆత్మహత్యగా రిజిస్టర్ చేశారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుందని త్వరలోనే అన్ని వివరాలు తెలియజేస్తామని కువైట్ పోలీసులు అన్నారు.
ఇదిలాఉంటే... కువైట్లో విజృంభిస్తున్న మహమ్మారి కరోనా వల్ల ప్రతిరోజు భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే 719 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఇప్పటివరకూ అక్కడ ఈ వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 27,762కి చేరిందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. మరో 8 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. దీంతో ఇప్పటివరకూ ఆ దేశంలో కోవిడ్-19తో చనిపోయిన వారు 220 మంది అయ్యారు.