దుబాయిలో భారత వ్యక్తికి జాక్‌పాట్ !

ABN , First Publish Date - 2021-01-23T20:49:51+05:30 IST

మహజూజ్ వీక్లీ డ్రాలో భారత సంతతి వ్యక్తికి జాక్‌పాట్ తగిలింది.

దుబాయిలో భారత వ్యక్తికి జాక్‌పాట్ !

దుబాయి: మహజూజ్ వీక్లీ డ్రాలో భారత సంతతి వ్యక్తికి జాక్‌పాట్ తగిలింది. తాజాగా దుబాయిలో నిర్వహించిన ఈ వీక్లీ డ్రాలో యూఏఈలో ఉండే శివిన్ విల్సన్ అనే కేరళకు చెందిన ఇంజనీర్ 2లక్షల దిర్హమ్స్(రూ.39,74,919) గెలుచుకున్నాడు. డ్రాలో పాల్గొన్న తొలిసారే విల్సన్ ఈ భారీ మొత్తం గెలుచుకోవడం విశేషం. దీంతో అతని సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. చాలా కాలంగా తన స్నేహితులు మహజూజ్ ప్లేయర్స్ అని చెప్పిన విల్సన్.. వారి ప్రోత్సహంతోనే ఇటీవలే తాను కూడా ఇందులో జాయిన్ అయినట్లు తెలిపాడు. ప్రస్తుతం పెట్రోకెమికల్ ప్లాంట్ నిర్మాణ విభాగంలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపిన అతను.. తాను గెలిచిన ఈ నగదుతో తన కెరీర్‌కు ఉపయోగపడేలా అదనపు కోర్సులు చేస్తానన్నాడు. దీంతో తనకు భవిష్యత్తులో మంచి అవకాశాలు అందుకునే వీలు ఉంటుందని పేర్కొన్నాడు. అలాగే తన పేరెంట్స్‌కు కూడా కొంత మొత్తం పంపిస్తాని తెలిపాడు. 

Updated Date - 2021-01-23T20:49:51+05:30 IST