తక్షణమే ఖార్కివ్ నుంచి వెళ్లిపొండి... భారతీయులకు ఇండియన్ ఎంబసీ ఆదేశం...

ABN , First Publish Date - 2022-03-02T23:16:03+05:30 IST

యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నగరం నుంచి వెంటనే, తక్షణమే

తక్షణమే ఖార్కివ్ నుంచి వెళ్లిపొండి... భారతీయులకు ఇండియన్ ఎంబసీ ఆదేశం...

కీవ్ : యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నగరం నుంచి వెంటనే, తక్షణమే వెళ్ళిపోవాలని భారతీయులను ఇండియన్ ఎంబసీ బుధవారం ఆదేశించింది. తాజాగా జారీ చేసిన అడ్వయిజరీలో ఖార్కివ్‌లో ఉన్న భారతీయులంతా తక్షణమే పెసోచిన్, బబయే, బెజ్లియుడోవికాలకు స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఆరు గంటల్లోగా వెళ్ళిపోవాలని తెలిపింది. 


రష్యా దళాలు నిరంతరం క్షిపణి దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ అడ్వయిజరీని జారీ చేసింది. 


Updated Date - 2022-03-02T23:16:03+05:30 IST