‘పాకిస్థాన్లో భారతీయుల సంక్షేమంపై పర్యవేక్షిస్తున్నాం’
ABN , First Publish Date - 2020-03-26T20:05:22+05:30 IST
నోవల్ కరోనా వైరస్ దాడి నేపథ్యంలో పాకిస్థాన్లోని భారతీయుల భద్రత, సంక్షేమంపై పర్యవేక్షిస్తున్నట్లు ఆ దేశంలోని భారత ఎంబసీ గురువారం ప్రకటించింది.
ఇస్లామాబాద్ : నోవల్ కరోనా వైరస్ దాడి నేపథ్యంలో పాకిస్థాన్లోని భారతీయుల భద్రత, సంక్షేమంపై పర్యవేక్షిస్తున్నట్లు ఆ దేశంలోని భారత ఎంబసీ గురువారం ప్రకటించింది.
పాకిస్థాన్లోని భారతీయులకు భరోసా ఇస్తూ గురువారం ఇచ్చిన ట్వీట్లో కరోనా వైరస్ మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని తెలిపింది. ఏదైనా సహాయం అవసరమైతే 030 28514549 నెంబరుకు ఫోన్ చేసి, తమను సంప్రదించవచ్చునని తెలిపింది. ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్న భారతీయ విద్యార్థులు కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తలు పాటిస్తూ, సురక్షితంగా ఉండాలని కోరింది. పాకిస్థాన్లోని అందరు భారతీయుల భద్రత, సంక్షేమాలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.
పాకిస్థాన్లో ఈ వైరస్ బాధితుల సంఖ్య 1,098కి చేరుకుంది. ఆగ్నేయ రాష్ట్రమైన సింధ్లో 413 కేసులు నమోదయ్యాయి. పాకిస్థాన్లో ఇప్పటి వరకు ఈ వైరస్ బాధితులు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్థాన్లోని పంజాబ్లో 323, బలూచిస్థాన్లో 131, ఇస్లామాబాద్లో 25, ఖైబర్ పష్తూన్లో 121 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.