సబా మృతికి సంతాపంగా.. ఎంబసీ, పాస్‌పోర్ట్ కేంద్రాలకు 3రోజులు సెలవు

ABN , First Publish Date - 2020-09-30T16:01:43+05:30 IST

కువైట్‌ రాజు షేక్‌ సబా అల్‌ అహ్మద్‌ సబా (91) మంగళవారం అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం సంతాపం ప్రకటించింది.

సబా మృతికి సంతాపంగా.. ఎంబసీ, పాస్‌పోర్ట్ కేంద్రాలకు 3రోజులు సెలవు

కువైట్ సిటీ: కువైట్‌ రాజు షేక్‌ సబా అల్‌ అహ్మద్‌ సబా (91) మంగళవారం అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం సంతాపం ప్రకటించింది. అలాగే సబా మృతికి సంతాపంగా కువైట్‌లోని భారత ఎంబసీతో పాటు షరాక్, ఫహహీల్, అబ్బాసియాలోని పాస్‌పోర్ట్ కేంద్రాలకు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 2 వరకు మూడు రోజులు సెలవులు ఇచ్చింది. అయితే, ఎమర్జెన్సీ కాన్సులర్ సర్వీసులు మాత్రం అందుబాటులో ఉంటాయని ఎంబసీ పేర్కొంది.   


భారత రాయబారి సీబీ జార్జ్ మాట్లాడుతూ... సబా మరణం కువైట్ కింగ్‌డమ్‌కు తీరని లోటు అని అన్నారు. గ్రేట్ లీడర్‌ను కోల్పోవడం ఎంతో బాధాకరం అని జార్జ్ పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా కువైట్‌లోని భారత సమాజం తరఫున రాయబారి సంతాపం తెలిపారు. 

Updated Date - 2020-09-30T16:01:43+05:30 IST