కొవిడ్ నష్టాలు అధిగమించేందుకు 12 ఏళ్లు పడుతుంది: ఆర్బీఐ

ABN , First Publish Date - 2022-04-30T03:17:02+05:30 IST

ముంబై : కొవిడ్ మహమ్మారి మిగిల్చిన నష్టాలను అధిగమించేందుకు భారత ఆర్థిక వ్యవస్థకు 12 ఏళ్ల సమయం పడుతుందని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ అంచనా వేసింది.

కొవిడ్ నష్టాలు అధిగమించేందుకు 12 ఏళ్లు పడుతుంది: ఆర్బీఐ

ముంబై : కొవిడ్ మహమ్మారి మిగిల్చిన నష్టాలను అధిగమించేందుకు భారత ఆర్థిక వ్యవస్థకు 12 ఏళ్ల సమయం పడుతుందని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ అంచనా వేసింది.  కరెన్సీ అండ్ ఫైనాన్స్ ఫర్ ది ఇయర్ 2021-22 పేరిట శుక్రవారం ఒక రిపోర్ట్‌ను విడుదల చేసింది. కరోనా సంక్షోభం ఆర్థిక వ్యవస్థలో చరిత్రాత్మక మార్పులు తీసుకొచ్చిందని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ప్రవేశపెడుతున్న సంస్కరణలకు కొవిడ్ సంక్షోభం ఒక ఉత్ప్రేరకంగా పనిచేసిందని పేర్కొంది. కరోనా కాలంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు మధ్యకాలికంలో వృద్ధి మెరుగుదలకు తోడ్పడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే కొవిడ్ కారణంగా ఆర్థిక సంవత్సరం 2020-21లో రూ.19.1 లక్షల కోట్లు, 2021-22లో రూ.17.1 లక్షల కోట్లు, 2022-23లో రూ.16.4 లక్షల కోట్ల చొప్పున ఉత్పత్తి నష్టం జరుగుతుందని లెక్కగట్టింది.

Updated Date - 2022-04-30T03:17:02+05:30 IST