సెమీ‌స్‌లో హుస్సాముద్దీన్‌

ABN , First Publish Date - 2021-03-05T09:36:55+05:30 IST

బాక్సమ్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో తెలుగు బాక్సర్‌ మహ్మద్‌ హుస్సాముద్దీన్‌, పూజా రాణి సెమీఫైనల్లోకి ప్రవేశించి.. కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకొన్నారు...

సెమీ‌స్‌లో హుస్సాముద్దీన్‌

కాస్టెల్లాన్‌ (స్పెయిన్‌): బాక్సమ్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో తెలుగు బాక్సర్‌ మహ్మద్‌ హుస్సాముద్దీన్‌, పూజా రాణి సెమీఫైనల్లోకి ప్రవేశించి.. కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకొన్నారు. లవ్లీనా బోర్గోహైన్‌, అమిత్‌ పంగల్‌ మాత్రం క్వార్టర్స్‌లోనే ఇంటిదారిపట్టారు. పురుషుల 57 కేజీల క్వార్టర్స్‌లో హుస్సాముద్దీన్‌ 5-0తో సిమోన్‌ (ఇటలీ)పై నెగ్గాడు. మహిళల 75 కేజీల క్వార్టర్స్‌లో కాన్ఫోరా (ఇటలీ)పై పూజా రాణి గెలుపొందింది. అయితే 69 కేజీల్లో సాదత్‌ డల్గాటోవా (రష్యా) చేతిలో లవ్లీనా పరాజయం చవిచూసింది.

Updated Date - 2021-03-05T09:36:55+05:30 IST