మాల్యాపై దివాలా చర్యలు.. లండన్ హైకోర్టుకు భారత బ్యాంకుల వినతి
ABN , First Publish Date - 2020-07-09T14:29:12+05:30 IST
పరారీ ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యా నుంచి బకాయిలు రాబట్టుకునేందుకు ఎస్బీఐ నేతృత్వంలోని 13 బ్యాంకుల కన్సార్షియం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది.
లండన్: పరారీ ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యా నుంచి బకాయిలు రాబట్టుకునేందుకు ఎస్బీఐ నేతృత్వంలోని 13 బ్యాంకుల కన్సార్షియం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. మాల్యా తమకిచ్చిన రెండో సెటిల్మెంట్ ఆఫర్ పనికి రానిదని, ఆయనపై దివాలా చర్యలకు ఆదేశించాలని భారత బ్యాంకుల కన్సార్షియం ఇంగ్లాండ్ హైకోర్టును కోరింది. లండన్ హైకోర్టులోని దివాలా కేసుల డివిజన్లో మంగళవారం ఈ కేసు విచారణ జరిగింది. బ్యాంకుల కన్సార్షియానికి మాల్యా దాదాపు 115 కోట్ల పౌండ్లు (దాదాపు రూ.10,800 కోట్లు) బకాయిపడ్డాడు. వీటిని రాబట్టుకునేందుకు 2018 డిసెంబరులో బ్యాంకులు మాల్యాపై దివాలా చర్యలను ప్రారంభించాయి.