నిషేధంపై గోమతి అప్పీలు

ABN , First Publish Date - 2020-08-03T08:56:52+05:30 IST

డోప్‌ పరీక్షలో విఫలమవడంతో తనపై విధించిన నాలుగేళ్ల నిషేధాన్ని సవాల్‌ చేస్తూ భారత అథ్లెట్‌ గోమతి మారిముత్తు

నిషేధంపై గోమతి అప్పీలు

చెన్నై: డోప్‌ పరీక్షలో విఫలమవడంతో తనపై విధించిన నాలుగేళ్ల నిషేధాన్ని సవాల్‌ చేస్తూ భారత అథ్లెట్‌ గోమతి మారిముత్తు అత్యున్నత క్రీడా కోర్టు అయిన కోర్టు ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ (సీఏఎస్‌)ను ఆశ్రయించింది. గతేడాది దోహా ఆసియా చాంపియన్‌షి్‌పలో 800 మీటర్ల రేసులో స్వర్ణం సాధించిన గోమతి డోపీగా తేలడంతో పతకాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు ఆమెపై నాలుగేళ్ల నిషేధాన్ని విధించారు. తనపై నిషేధాన్ని ఎత్తేయాల్సిందిగా సీఏఎ్‌సలో అప్పీలు చేసుకున్నట్టు తమిళనాడుకు చెందిన 31 ఏళ్ల గోమతి తెలిపింది. నిరుడు ఏప్రిల్‌లో కతార్‌లో జరిగిన ఆసియా టోర్నీ సందర్భంగా నిర్వహించిన డోప్‌ పరీక్షలో గోమతి నిషేధిత అనబాలిక్‌ ఉత్ర్పేరకం వాడినట్టు తేలింది. దీంతో ఆమెపై 2023 వరకు నిషేధం విధించారు. 


Updated Date - 2020-08-03T08:56:52+05:30 IST