మసూద్ అజహర్ బంధువు ఫౌజీ బాబా హతం
ABN , First Publish Date - 2020-06-03T18:25:12+05:30 IST
శ్రీనగర్: జైష్ ఎ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అతడి బంధువు, జైష్ ఎ మహ్మద్ టాప్ కమాండర్ ఫౌజీ బాబా హతమయ్యాడు.
శ్రీనగర్: జైష్ ఎ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అతడి బంధువు, జైష్ ఎ మహ్మద్ టాప్ కమాండర్ ఫౌజీ బాబా హతమయ్యాడు. ఫౌజీ బాబా పాకిస్థాన్లోని ముల్తాన్కు చెందిన వాడు.
పుల్వామాలోని కంగన్ ప్రాంతంలో జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఫౌజీ బాబా కూడా ఉన్నాడు. ఇతడు మందుపాతరలు పెట్టి పేల్చడంలో దిట్ట. హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో వలీద్ కూడా ఉన్నాడని జమ్మూకశ్మీర్ పోలీస్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు.
జమ్మూ కశ్మీర్లో ఇప్పటివరకూ 75 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని విజయ్ కుమార్ విలేకరుల సమావేశంలో చెప్పారు. జైష్ ఎ మహ్మద్ చీఫ్ ఘాజీ కోసం వేట కొనసాగిస్తున్నామని, త్వరలోనే అతడిని మట్టుబెడతామన్నారు.
పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14న 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్నట్లు గానే వారం క్రితం ఉగ్రవాదులు కారులో 45 కేజీల పేలుడు పదార్ధాలతో భదత్రా దళాలను టార్గెట్ చేశారు. అయితే దీన్ని సైన్యం వమ్ము చేసింది. ఉగ్రవాదులు పుల్వామాలో భారీ పేలుడు పదార్ధాలతో కారులో వెళ్తుండగా భద్రతా బలగాలు వెంబడించాయి. కాల్పులు జరపడంతో ఉగ్రవాదులు కారు వదిలి పారిపోయారు. కారులో ఉన్న పేలుడు పదార్ధాలను సైన్యం నిర్మానుష్య ప్రదేశంలో పేల్చివేసింది. ఆ తర్వాత పారిపోయిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగించారు. వలీద్, ఫౌజీబాబాతో పాటు మరో ఉగ్రవాదిని మట్టుబెట్టారు.