34 లక్షల హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్ల విరాళం.. అమెరికాలో..
ABN , First Publish Date - 2020-04-10T03:45:09+05:30 IST
భారత సంతతికి చెందిన ఆమ్నీల్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ అమెరికా ప్రభుత్వానికి 34 లక్షల హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్లను విరాళంగా ప్రకటించింది.
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన ఆమ్నీల్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ అమెరికా ప్రభుత్వానికి 34 లక్షల హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్లను విరాళంగా ప్రకటించింది. 20 లక్షల టాబ్లెట్లను న్యూయార్క్కు, పది లక్షల టాబ్లెట్లు టెక్సాస్కు విరాళంగా ఇస్తున్నట్టు సంస్థ పేర్కొంది. మరో నాలుగు లక్షల టాబ్లెట్లు లూసియానాకు ఇవ్వనున్నట్టు తెలిపింది. చిరాగ్, చింటు పటేల్ అనే భారతీయులు న్యూజెర్సీ కేంద్రంగా ఆమ్నీల్ ఫార్మాస్యూటికల్స్ను నడుపుతున్నారు. ఏప్రిల్ చివరి నాటికి 2 కోట్ల టాబ్లెట్లను తయారుచేసి దేశవ్యాప్తంగా ఎక్కడ అవసరమైతే అక్కడ ఉపయోగించనున్నట్టు చిరగ్, చింటు తెలియజేశారు. కాగా.. హైడ్రాక్సీక్లోరిక్విన్ను అమెరికా పంపాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల మోదీని కోరిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం కూడా హైడ్రాక్సీక్లోరోక్విన్ ఏ దేశాలకు అవసరముందో ఆ దేశాలకు ఎగుమతి చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.