కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతి వ్యక్తి అరుదైన గౌరవం లభించింది. ఆరెంజ్ కౌంటీలోని సుపీరియర్ కోర్టు జడ్జ్గా నియామకం అయ్యారు. దీంతో ఆ పదవిని చేపట్టిన మొట్టమొదటి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్.. భారత సంతతికి చెందిన 39ఏళ్ల వైభవ్ మిట్టల్ను ఆరెంజ్ కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తిగా నియమించారు. ఈ క్రమంలో ఆయన ఈ నెల 10న ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించారు. దీంతో రొనాల్డ్ ఎల్ బాయర్ స్థానాన్ని వైభవ్ మిట్టల్ భర్తీ చేశారు. ఈ నేపథ్యంలో ఆరెంజ్ కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి సౌత్ ఆసియన్ వ్యక్తిగా మిట్టల్ వైభవ్ గుర్తింపు పొందారు.
ఇదిలా ఉంటే.. వైభవ్ మిట్టల్ గతంలో సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియాలో అసిస్టెంట్ యూఎస్ అటార్నీ జనరల్గా పని చేశారు. అనంతరం డిప్యూటీ చీఫ్గా ప్రమోట్ అయ్యారు. పొలిటికల్ సైన్స్ మరియు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి వైభవ్ మిట్టల్ గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా లో ప్రవేశం పొందడానికి పూర్వం.. సెమీకండక్టర్ ఇండస్ట్రీలో వైభవ్ మిట్టల్ పని చేశారు. ఇర్విన్ స్కూల్ ఆఫ్ లా, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో లెక్చరర్గా పని చేసిన అనుభవం కూడా వైభవ్ మిట్టల్కు ఉంది.