రూ.180కోట్ల భారీ మోసానికి పాల్పడిన భారతీయ అమెరికన్!

ABN , First Publish Date - 2021-03-26T16:47:34+05:30 IST

కరోనాతో ఆర్థికంగా దెబ్బతిన్న అమెరికన్లను ఆదుకునేందుకు యూఎస్ సర్కార్ అమలు చేస్తున్న కొవిడ్ రిలీఫ్ స్కీంలో భారీ మోసానికి పాల్పడిన భారతీయ అమెరికన్‌ను తాజాగా అక్కడి న్యాయ విభాగం దోషిగా తేల్చింది.

రూ.180కోట్ల భారీ మోసానికి పాల్పడిన భారతీయ అమెరికన్!

వాషింగ్టన్: కరోనాతో ఆర్థికంగా దెబ్బతిన్న అమెరికన్లను ఆదుకునేందుకు యూఎస్ సర్కార్ అమలు చేస్తున్న కొవిడ్ రిలీఫ్ స్కీంలో భారీ మోసానికి పాల్పడిన భారతీయ అమెరికన్‌ను తాజాగా అక్కడి న్యాయ విభాగం దోషిగా తేల్చింది. టెక్సాస్​లో ఉండే ఓ భారతీయుడు కొవిడ్​ ఉపశమన పథకంలో 24.8 మిలియన్ డాలర్లు(రూ.180 కోట్లు) మోసానికి పాల్పడినట్లు అమెరికా​ న్యాయ విభాగం వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే.. టెక్సాస్‌లో నివాసముండే దినేష్ షా(55) అనే భారత సంతతి వ్యక్తి 15 బోగస్​ పత్రాలను ఉపయోగించి వివిధ బ్యాంకుల నుంచి 'పే చెక్​ ప్రొటెక్షన్​ ప్రోగ్రాం'(పీపీపీ) ద్వారా మోసపూరితంగా సుమారు రూ.180 కోట్లు పొందాడు. తనకు పలురకాల వ్యాపారాలున్నాయని చెప్పి వివిధ వ్యక్తుల పేరు మీద దినేష్ ఇలా భారీ మొత్తాన్ని పొందినట్లు న్యాయ విభాగం గుర్తించింది. అనంతరం ఈ డబ్బుతో అతను విలాసవంతమైన కార్లు, ఇళ్లను కొనుగోలు చేయడంతో పాటు జల్సాలకు ఉపయోగించనట్లు జస్టిస్ డిపార్ట్​మెంట్​ క్రిమినల్​ విభాగం తాత్కాలి అటార్నీ జనరల్​ నికోలస్ ఎల్ మెక్‌క్వైడ్​ పేర్కొన్నారు. తాజాగా దినేష్‌ను యూఎస్​ న్యాయ విభాగం ముందు హాజరుపరచగా తన నేరాన్ని అంగీకరించినట్లు వెల్లడించింది. దీంతో న్యాయ విభాగం అతడ్ని దోషిగా తేల్చింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది.  


Updated Date - 2021-03-26T16:47:34+05:30 IST