పాస్‌పోర్ట్ ఔట్ సోర్స్ సెంట‌ర్‌లో భార‌త రాయ‌బారి ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న‌

ABN , First Publish Date - 2020-08-25T16:19:40+05:30 IST

కువైట్‌లోని భార‌త రాయ‌బారి సిబి జార్జి జిలీబ్‌లోని పాస్‌పోర్ట్ ఔట్ సోర్స్ సెంట‌ర్‌లో ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న చేశారు.

పాస్‌పోర్ట్ ఔట్ సోర్స్ సెంట‌ర్‌లో భార‌త రాయ‌బారి ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న‌

కువైట్ సిటీ: కువైట్‌లోని భార‌త రాయ‌బారి సిబి జార్జి జిలీబ్‌లోని పాస్‌పోర్ట్ ఔట్ సోర్స్ సెంట‌ర్‌లో ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న చేశారు. ఈ సంద‌ర్భంగా భార‌త క‌మ్యూనిటీ స‌భ్యుల‌తో ముచ్చ‌టించిన రాయ‌బారి అక్క‌డి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. పాస్ట్‌పోర్టు రెన్యూవల్‌, ఇతర సంబంధిత స‌మ‌స్య‌ల‌పై క‌మ్యూనిటీ స‌భ్యుల వ‌ద్ద ఆరా తీశారు. 


గ‌త బుధ‌వారం జ‌రిగిన ఓపెన్ హౌజ్ మీటింగ్ సంద‌ర్భంగా ప్ర‌వాసులు కొన్ని పాస్‌పోర్టు సంబంధిత స‌మ‌స్య‌లను తెర‌‌పైకి తెచ్చారు. దీనిపై స్పందించిన భార‌త అంబాసిడ‌ర్ తాను వాటి ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అన్న‌ట్టుగానే సిబి జార్జి పాస్‌పోర్ట్ ఔట్ సోర్స్ సెంట‌ర్‌లో ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న చేసి అక్క‌డి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం వాటి ప‌రిష్కారం దిశ‌గా అక్క‌డి సిబ్బందికి ప‌లు సూచ‌న‌లు చేశారు. దీంతో జార్జి ప‌ర్య‌ట‌న‌పై భార‌త క‌మ్యూనిటీ హ‌ర్షం వ్య‌క్తం చేసింది.     

Updated Date - 2020-08-25T16:19:40+05:30 IST