వివిధ దేశాల అంబాసిడర్లకు ఓనం విందు ఇచ్చిన భారత రాయబారి
ABN , First Publish Date - 2021-08-22T13:42:46+05:30 IST
కువైత్లోని భారత రాయబారి సీబి జార్జ్ ఓనం పండుగ సందర్భంగా వివిధ దేశాల రాయబారులకు ఇండియా హౌస్లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.
కువైత్ సిటీ: కువైత్లోని భారత రాయబారి సీబి జార్జ్ ఓనం పండుగ సందర్భంగా వివిధ దేశాల రాయబారులకు ఇండియా హౌస్లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇండియా హౌస్ను భారతీయత ఉట్టిపడేలా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఓనం సందర్భంగా పుష్పాలతో వేసే ముగ్గు ఇండియా హౌస్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీబి జార్జ్ అంబాసిడర్లను భారతీయ స్టైల్లో శాలువాలు(పొన్నాడ) కప్పి.. పత్యేకంగా ఆహ్వానించడం ఈ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్. వివిధ దేశాల రాయబారులు ఈ ప్రత్యేక ఆతిథ్యం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
ఇక ఆదివారం(ఆగస్టు 22) రాయబార కార్యాలయంలో ఓనం వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు సీబి జార్జ్ వెల్లడించారు. ఈ వేడుకల్లో భాగంగా ఎంబసీలో సందర్శకులకు పాయసం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఎంబసీ సోషల్ మీడియా సైట్స్ ద్వారా వర్చువల్ విధానంలో సాయంత్రం 6 గంటలకు జరిగే ఓనం కార్యక్రమంలో కువైట్లోని భారతీయులందరూ పాల్గొనాలని రాయబారి పిలుపునిచ్చారు.