కరాచీలో దిగిన మరో భారత విమానం
ABN , First Publish Date - 2022-08-16T07:07:48+05:30 IST
మరో భారత విమానం సోమవారం పాకిస్థాన్లోని కరాచీ విమానాశ్రయంలో దిగింది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
ఇస్లామాబాద్, ఆగస్టు 15: మరో భారత విమానం సోమవారం పాకిస్థాన్లోని కరాచీ విమానాశ్రయంలో దిగింది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 12 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ చార్టర్డ్ విమానం మధ్యాహ్నం 12.10 గంటలకు కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. ఆ తర్వాత కొద్ది సేపటికే ఆ విమానం అక్కడి నుంచి బయలుదేరి వెళ్లింది. అయితే ఏ కారణంతో ఈ విమానం కరాచీ విమానాశ్రయంలో దిగిందన్నది స్పష్టంగా తెలియలేదు. కాగా నెల రోజుల్లో భారత విమానాలు కరాచీ విమానాశ్రయంలో దిగడం ఇది మూడోసారి. ఇప్పటికే రెండుసార్లు సాంకేతిక సమస్యలతో స్పైస్జెట్, ఇండిగో విమానాలు జూలై 5, 17వ తేదీల్లో కరాచీ విమానాశ్రయంలో దిగాయి.