సిరీస్ నిర్ణయాత్మక టీ20.. టాస్ గెలిచిన రోహిత్ శర్మ
ABN , First Publish Date - 2021-11-20T00:22:25+05:30 IST
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య మరికాసేపట్లో రాంచీలో
రాంచీ: మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య మరికాసేపట్లో రాంచీలో రెండో టీ20 ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ కివీస్కు బ్యాటింగ్ అప్పగించాడు. రాంచీ మైదానం చేజింగ్కు అనుకూలంగా ఉంటుందని రోహిత్ చెప్పాడు.
జట్టులోని కుర్రాళ్లు తమ ప్రతిభ నిరూపించుకునేందుకు ఇదే మంచి సమయమన్నాడు. మహ్మద్ సిరాజ్ స్థానంలో హర్షల్ పటేల్ జట్టులోకి వచ్చినట్టు చెప్పాడు. ఇక న్యూజిలాండ్ జట్టులో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి.
ఫెర్గ్యూసన్, రచిన్ రవీంద్ర, ఆస్లే స్థానంలో మిల్నే, నీషమ్, సోధీ జట్టులోకి వచ్చారు. తొలి మ్యాచ్లో నెగ్గిన రోహిత్ సేన ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుండగా, ఈ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా సిరీస్ను సమం చేయాలని కివీస్ భావిస్తోంది.