India-Sri Lanka: టాస్ గెలిచిన టీమిండియా
ABN , First Publish Date - 2021-07-30T01:07:57+05:30 IST
శ్రీలంకతో కాసేపట్లో జరగనున్న సిరీస్ ఫలితాన్ని కీలక మ్యాచ్లో భారత జట్టు టాస్ గెలిచి
కొలంబో: శ్రీలంకతో కాసేపట్లో జరగనున్న సిరీస్ ఫలితాన్ని తేల్చే కీలక మ్యాచ్లో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లకు ఇది కీలకమైన మ్యాచే. సిరీస్ నిర్ణాయక మ్యాచ్ కావడంతో ఇరు జట్లు పోటాపోటీగా తలపడే అవకాశం ఉంది. భారత జట్టు ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. రెండో టీ20లో గాయపడిన సైనీ స్థానంలో సందీప్ వారియర్ను తుదిజట్టులోకి దించుతోంది. ఈ మ్యాచ్లో విజయం తమకు చాలా కీలకమని శ్రీలంక సారథి దాసున్ శనక అన్నాడు. తొలుత బౌలింగ్ చేయడం తమకు సంతోషమేనని పేర్కొన్నాడు. ఇసురు ఉడానా స్థానంలో పాతుమ్ నిస్సంక జట్టులోకి వచ్చినట్టు చెప్పాడు.