India Vs Westindies T20 : విండీస్‌కి భారీ లక్ష్యం నిర్దేశించిన భారత్..

ABN , First Publish Date - 2022-08-08T03:40:29+05:30 IST

ఇండియా వర్సెస్ వెస్టిండీస్ (India Vs Westindies) 5వ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 188 పరుగులు నమోదు చేసింది.

India Vs Westindies T20 : విండీస్‌కి భారీ లక్ష్యం నిర్దేశించిన భారత్..

ఫ్లోరిడా : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ (India Vs Westindies) 5వ మ్యాచ్‌లో భారత్ బ్యాట్స్‌మెన్ రాణించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 188 పరుగులు నమోదు చేసింది. దీంతో ప్రత్యర్థి వెస్టిండీస్ విజయలక్ష్యం 189 పరుగులుగా ఉంది. ఓపెనర్ శ్రేయర్ అయ్యర్‌(68)కిపాటు దీపక్ హూడా(38) రాణించడంతో ఈ భారీ స్కోర్ సాధ్యపడింది. వీరిద్దరి తర్వాత వచ్చినవారు స్వల్ప స్కోర్లకే వెనుదిరగడంతో పరుగుల వేగం తగ్గింది. భారత్ బ్యాట్స్‌మెన్లలో ఇషాన్ కిషన్(11), శ్రేయస్ అయ్యర్(68), దీపక్ హుడా(38), సంజూ శాంసన్(15), హార్ధిక్ పాండ్యా(28), దినేష్ కార్తీక్(12), అక్సర్ పటేల్(9), కుల్దీప్ యాదవ్(0, నాటౌట్), ఆవేశ్ ఖాన్(1, నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో ఓడియన్ స్మిట్ 3 వికెట్లు, జాసన్ హోల్డర్, డొమినిక్ డ్రేక్స్, హైడెన్ వాల్ష్ తలో వికెట్ చొప్పున తీశారు. హార్ధిక్ పాండ్యా రనౌట్ అయ్యాడు.

Updated Date - 2022-08-08T03:40:29+05:30 IST