india vs west indies t20 : ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కి కాస్త నిరాశ.. 8 గంటలకు మొదలవ్వాల్సిన మ్యాచ్..

ABN , First Publish Date - 2022-08-02T01:21:16+05:30 IST

ఇండియా వర్సెస్ వెస్టిండీస్ ( India vs West Indies) టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ గెలిచిన రోహిత్ శర్మ సేన మంచి జోరు మీద కనిపిస్తోంది.

india vs west indies t20 : ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కి కాస్త నిరాశ.. 8 గంటలకు మొదలవ్వాల్సిన మ్యాచ్..

సెయింట్ కిట్స్ : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ ( India vs West Indies) టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ గెలిచిన రోహిత్ శర్మ సేన మంచి జోరు మీద కనిపిస్తోంది. నేడు (సోమవారం) రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌లో ఇంకో అడుగు ముందుకేయాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు తగ్గట్టు 2 రోజులపాటు ప్రాక్టీస్ కూడా చేసింది. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌ (Cricket Fans) కూడా 8 గంటల మొదలయ్యే మ్యాచ్ కోసం సిద్ధమవుతుండగా క్రికెట్ వెస్టిండీస్(CWI) నుంచి ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. షెడ్యూల్ ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవ్వాల్సిన 2 గంటలు ఆలస్యంగా 10 గంటలకు ఆరంభమవనుందని ప్రకటించింది. తొలి మ్యాచ్ జరిగిన ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ నుంచి సెయింట్ కిట్స్‌కు చేరాల్సిన టీమ్ లగేజీ సమయానికి రాలేదు. రవాణా ఇబ్బందుల కారణంగా ఈ పరిస్థితి అనివార్యమైంది. దీంతో మ్యాచ్‌ను 2 గంటలపాటు వాయిదా వేస్తున్నట్టు క్రికెట్ వెస్టిండీస్ స్పష్టం చేసింది. భారతీయ కాలమానం ప్రకారం.. రాత్రి 10 గంటలకు మ్యాచ్ మొదలవుతుందని తెలిపింది. అసౌకర్యానికి గురి చేస్తున్నందున విలువైన క్రికెట్ ఫ్యాన్స్, స్పాన్సర్లు, బ్రాడ్‌కాస్టింగ్ పార్టనర్స్, ఇతర భాగస్వాములకు పశ్చాత్తాపాన్ని తెలియజేస్తున్నట్టు పేర్కొంది.


అనివార్య పరిస్థితుల కారణంగా తీసుకున్న ఈ నిర్ణయం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌ని కాస్త నిరాశకు గురిచేస్తోంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ మొదలైతే 11 : 30 గంటల కల్లా పూర్తవుతుంది. అదే 10 గంటల మొదలైతే  అర్ధరాత్రి దాటాక 1:30 గంటల వరకు కొనసాగుతుంది. మ్యాచ్ చూడాలనుకునేవాళ్లు అంతసేపు నిద్ర ఆపుకోవడం తప్పదు.


కాగా శుక్రవారం ముగిసిన తొలి మ్యాచ్‌లో టీమిండియా సమష్టి ప్రదర్శనతో విజయం సాధించింది. 68 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టి సిరీస్‌లో అదిరిపోయే బోణి చేసింది. కాగా రెండవ మ్యాచ్ జరగబోయే వేదిక సెయింట్ కిట్స్‌లోనే మూడవ మ్యాచ్ జరగనుంది. మంగళవారమే ఈ మ్యాచ్ జరగనుంది.

Updated Date - 2022-08-02T01:21:16+05:30 IST