1st ODI: భారత్‌పై 9 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపు

ABN , First Publish Date - 2022-10-07T05:48:46+05:30 IST

1st ODI: భారత్‌పై 9 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపు

1st ODI: భారత్‌పై 9 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపు

లక్నో: భారత్‌పై దక్షిణాఫ్రికా 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. 40 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా 249 పరుగులు చేసింది. 40 ఓవర్లలో భారత్ 8 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. వర్షం కారణంగా 50 ఓవర్ల వన్డే మ్యాచ్‌ని 40 ఓవర్లకు కుదించారు. భారత క్రికెట్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా క్రికెటర్లు భారత్ ముందు 250 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని పెట్టారు. 250 పరుగుల భారీ విజయ లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో బరిలోకి  దిగిన భారత బ్యాట్స్‌మెన్స్ తడబడుతూ ఆడుతూ వికెట్లు కోల్పోయారు. 250 పరుగుల లక్ష్యాన్ని భారత ఆటగాళ్లు ఛేదించలేకపోయారు.

Updated Date - 2022-10-07T05:48:46+05:30 IST