India vs Pakistan: ప్రారంభమైన మ్యాచ్.. 18 ఓవర్లకు కుదింపు

ABN , First Publish Date - 2022-07-31T22:23:06+05:30 IST

వర్షం తగ్గడంతో భారత్-పాకిస్థాన్ మహిళల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం

India vs Pakistan: ప్రారంభమైన మ్యాచ్.. 18 ఓవర్లకు కుదింపు

బర్మింగ్‌హామ్: వర్షం తగ్గడంతో భారత్-పాకిస్థాన్ మహిళల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం కావడంతో మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌కు రెండో ఓవర్  మూడో బంతికే ఎదురుదెబ్బ తగిలింది.


ఖాతా తెరవకుండానే ఓపెనర్ ఇరామ్ జావేద్ వికెట్‌ను కోల్పోయింది. మేఘనా సింగ్ బౌలింగులో యస్తికా భాటియాకు క్యాచ్ ఇచ్చి ఇరామ్ పెవిలియన్ చేరింది. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిశాయి. పాకిస్థాన్ వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. వికెట్ కీపర్ మునీబా అలీ (18), కెప్టెన్ బిస్మా మరూఫ్ (16) క్రీజులో ఉన్నారు. 

Updated Date - 2022-07-31T22:23:06+05:30 IST