సుదీర్ఘ ప్రయాణం తర్వాత భారత్ చేరుకున్న భారత యువ జట్టు
ABN , First Publish Date - 2022-02-08T21:39:20+05:30 IST
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్లో అప్రతిహత విజయాలతో ఫైనల్కు దూసుకెళ్లిన భారత యువ జట్టు ఇంగ్లండ్ను..
న్యూఢిల్లీ: ఐసీసీ అండర్-19 ప్రపంచకప్లో అప్రతిహత విజయాలతో ఫైనల్కు దూసుకెళ్లిన భారత యువ జట్టు ఇంగ్లండ్ను మట్టి కరిపించి దేశానికి ఐదో ప్రపంచకప్ అందించింది. అంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ఇంగ్లండ్తో శనివారం జరిగిన ఫైనల్లో యశ్ ధుల్ సేన నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రాజ్ బవా ఐదు వికెట్లు, రవికుమార్ నాలుగు వికెట్లు తీసి చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించారు.
ప్రపంచకప్ గెలుచుకున్న భారత యువ జట్టు సుదీర్ఘ ప్రయాణం అనంతరం నేడు బెంగళూరు చేరుకుంది. ఆమ్స్టర్డామ్, దుబాయ్ మీదుగా ఆటగాళ్లు నగరానికి చేరుకున్నారు. ప్రపంచకప్ గెలుచుకున్న జూనియర్ జట్టును బీసీసీఐ సన్మానించనున్న నేపథ్యంలో ఆటగాళ్లంతా తిరిగి అహ్మదాబాద్ చేరుకుంటారు. ఈ కార్యక్రమం బుధవారం జరిగే అవకాశం ఉంది.