విండీస్తో పోరుకు టీమిండియా రెడీ.. అహ్మదాబాద్ చేరుకున్న జట్టు
ABN , First Publish Date - 2022-02-01T01:30:28+05:30 IST
వెస్టిండీస్తో త్వరలో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్టు రెడీ అయింది. బయోబుల్లోకి
అహ్మదాబాద్: వెస్టిండీస్తో త్వరలో ప్రారంభం కానున్న పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్టు రెడీ అయింది. బయోబుల్లోకి వెళ్లేందుకు సోమవారం టీమిండియా జట్టు సభ్యులు అహ్మదాబాద్ చేరుకున్నారు. ఆది, సోమవారాల మధ్య జట్టు సభ్యులు మొత్తం బయోబబుల్లోకి వెళ్లారు. వీరు మూడు రోజులపాటు క్వారంటైన్లో గడుపుతారు.
తాను శనివారమే అహ్మదాబాద్ చేరుకున్నట్టు చెబుతూ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ట్విట్టర్లో ఫొటో షేర్ చేశాడు. విమానంలో అతడు శిఖర్ ధవన్ పక్కన కూర్చున్నట్టుగా ఆ ఫొటో ఉంది. కాగా, వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మకు ఇదే తొలి సిరీస్. దక్షిణాఫ్రికాతో సిరీస్కే అతడు వన్డే కెప్టెన్గా ఎంపికైనప్పటికీ గాయం కారణంగా దక్షిణాఫ్రికా వెళ్లలేకపోయాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఫిబ్రవరి 6న అహ్మదాబాద్లో తొలి వన్డే జరుగుతుంది.