‘నిట్‌ ఇండియా’గా ముందుకు సాగాలి: వెంకయ్య

ABN , First Publish Date - 2020-08-10T06:50:16+05:30 IST

క్విట్‌ ఇండియా ఉద్యమం స్ఫూర్తిగా ‘నిట్‌ ఇండియా(ఐక్య భారత్‌)’ ఉద్యమం జరగాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు నిచ్చారు. క్విట్‌ ఇండియా ఉద్యమ 78వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఫేస్‌బుక్‌లో...

‘నిట్‌ ఇండియా’గా ముందుకు సాగాలి: వెంకయ్య

న్యూఢిల్లీ, ఆగస్టు 9: క్విట్‌ ఇండియా ఉద్యమం స్ఫూర్తిగా ‘నిట్‌ ఇండియా(ఐక్య భారత్‌)’ ఉద్యమం జరగాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు నిచ్చారు. క్విట్‌ ఇండియా ఉద్యమ 78వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఫేస్‌బుక్‌లో ఈమేరకు ఓ పోస్టు చేశారు. విదేశీయులు ధ్వంసం చేసిన సోమ్‌నాథ్‌ ఆలయాన్ని పునర్నిర్మించేందుకు చాలాకాలం పట్టిందన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభించేందుకూ 500 ఏళ్లకుపైగా పట్టిందని తెలిపారు.

Updated Date - 2020-08-10T06:50:16+05:30 IST