భారత్‌లో గత 24 గంటల్లో అనూహ్యంగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2020-04-10T23:44:18+05:30 IST

భారత్‌లో గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగాయి. గడచిన 24 గంటల్లో...

భారత్‌లో గత 24 గంటల్లో అనూహ్యంగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

న్యూఢిల్లీ: భారత్‌లో గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగాయి. గడచిన 24 గంటల్లో 896 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. భారత్‌లో 24 గంటల్లో 37 మంది కరోనా బారిన పడి చనిపోయినట్లు వెల్లడించింది.


భారత్‌లో తాజా కేసులతో కలిపి మొత్తం ఇప్పటివరకూ 6,761 పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్రం తెలిపింది. ఇందులో 6039 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 516 మంది కరోనా నుంచి కోలుకున్నారు. భారత్‌లో కరోనా సోకి ఇప్పటిదాకా 206 మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.

Updated Date - 2020-04-10T23:44:18+05:30 IST