జమ్మూ-కాశ్మీర్ మా అంతర్గత వ్యవహారం: చైనాకు భారత్ వార్నింగ్

ABN , First Publish Date - 2020-04-10T04:08:50+05:30 IST

జమ్మూ-కాశ్మీర్‌కు సంబంధించి ఐరాసలో చైనా మాట్లాడడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. జమ్మూ-కాశ్మీర్ భారత అంతర్గత వ్యవహారమని, అందులో ఎవరి జోక్యం అవసరం...

జమ్మూ-కాశ్మీర్ మా అంతర్గత వ్యవహారం: చైనాకు భారత్ వార్నింగ్

న్యూఢిల్లీ: జమ్మూ-కాశ్మీర్‌కు సంబంధించి ఐరాసలో చైనా మాట్లాడడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. జమ్మూ-కాశ్మీర్ భారత అంతర్గత వ్యవహారమని, అందులో ఎవరి జోక్యం అవసరం లేదని హెచ్చరించింది. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ-కాశ్మీర్‌ ఇంతకుముందు, ఇప్పుడు, ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమేనని, దీనిపై చైనాకు పూర్తి అవగాహన ఉందని, దానికి కట్టుబడి ఉండాలని విదేశీ వ్యవహారాల శాఖ  మంత్రిత్వ శాఖ చైనాకు సూచించింది. చైనా మాత్రమే కాదని, ఇతర దేశాలు ఏవైనా జమ్మూ-కాశ్మీర్  వ్యవహారంలో తలదూర్చినా సహించేది లేదని తేల్చి చెప్పింది. 

‘పక్కదేశాల ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం, ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని, భౌగోళిక సరిహద్దుల విధానాలను గౌరవించడం అనేది చాలా అవసరం. భారతదేశం విషయంలో కూడా అన్ని దేశాలు దీనిని పాటించాలని మేము ఆశిస్తున్నామ’ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. చైనా భారత అంతరంగిక విషయాలపై కాకుండా ఉగ్రవాదాన్నిఅంతమొందించడం గురించి ఆలోచించాలని, ఒకదేశంలో నుంచి మరో దేశంలోకి అక్రమంగా ఉగ్రవాదులు చొరబడుతున్నారని, ఈ సమస్యను అధిగమించడంపై చైనా దృష్టి సారిస్తే బాగుంటుందని భారత్ సూచించింది.

Updated Date - 2020-04-10T04:08:50+05:30 IST