పాక్‌లో పడ్డ భారత క్షిపణి.. విచారణకు భారత్ ఆదేశం

ABN , First Publish Date - 2022-03-12T01:59:33+05:30 IST

భారత్‌కు చెందిన మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంలో పడిన ఘటనపై మోదీ ప్రభుత్వం అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. బుధవారం సాయంత్రం సిస్రా వైపు నుంచి సూపర్‌సోనిక్‌ మిస్సైల్‌ ఒకటి 124 కిలోమీటర్ల..

పాక్‌లో పడ్డ భారత క్షిపణి.. విచారణకు భారత్ ఆదేశం

న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంలో పడిన ఘటనపై మోదీ ప్రభుత్వం అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. బుధవారం సాయంత్రం సిస్రా వైపు నుంచి సూపర్‌సోనిక్‌ మిస్సైల్‌ ఒకటి 124 కిలోమీటర్ల అవతల పాక్‌ సరిహద్దులో కూలింది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. ఈ విషయమై శుక్రవారం రక్షణ శఆఖ మంత్రి మాట్లాడుతూ సాంకేతిక లోపం కారణంగా పొరపాటుగా జరిగిన ఘటన ఇదని అన్నారు. ఈ క్షిపణి 40,000 అడుగుల ఎత్తులో దూసుకెళ్లిందని, పాక్‌ భూభాగంలోని పౌర నివాసాలు, పాక్‌తోపాటు భారత్‌ గగనతలంలోని ప్రయాణ విమానాలకు ముప్పును రేకెత్తించిందని పాకిస్థాన్‌ ఆరోపించింది. ఈ చర్యను ఖండిస్తున్నట్లు పేర్కొంది.

Updated Date - 2022-03-12T01:59:33+05:30 IST