అత్యధిక కోవిడ్ కేసులు నమోదు...రెండు నెలల్లో ఇదే ప్రథమం

ABN , First Publish Date - 2021-09-02T17:47:22+05:30 IST

దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ విజృంభిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గత 24 గంటల్లో..

అత్యధిక కోవిడ్ కేసులు నమోదు...రెండు నెలల్లో ఇదే ప్రథమం

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ విజృంభిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 47,092 కరోనా కేసులు నమోదయ్యాయి. గత రెండు నెలల్లో ఇంత అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారని  కేంద్ర ఆరోగ్య శాఖ గురవారంనాడు తెలిపింది. గురువారం సవరించిన గణాంకాల ప్రకారం కొత్తగా 509 మరణాలతో ఇంతవరకు దేశంలో కరోనా మృతుల సంఖ్య 4,39,552కు చేరినట్టు పేర్కొంది. కొత్తగా నమైదైన కేసుల్లో ఒక్క కేరళలో 32,803 నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కోవిడ్ నుంచి కోలుకున్న వారి రేటు 97.48కి చేరింది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.62గా రికార్డయింది. కాగా, బుధవారంనాడు దేశంలో 81.09 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్లు వేశారు. 66.30 కోట్లకు  వ్యాక్సినేషన్ డ్రైవ్ చేరుకున్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Updated Date - 2021-09-02T17:47:22+05:30 IST