ఆసియా కప్ మూడోరౌండ్కు భారత్
ABN , First Publish Date - 2021-06-16T06:36:27+05:30 IST
భారత ఫుట్బాల్ జట్టు ఆసియా కప్ అర్హత పోటీల మూడోరౌండ్కు చేరుకుంది. మంగళవారం అఫ్ఘానిస్థాన్తో జరిగిన మ్యాచ్ని 1-1తో డ్రాగా ముగించడం ద్వారా భారత్ తమ గ్రూప్లో...
దోహా: భారత ఫుట్బాల్ జట్టు ఆసియా కప్ అర్హత పోటీల మూడోరౌండ్కు చేరుకుంది. మంగళవారం అఫ్ఘానిస్థాన్తో జరిగిన మ్యాచ్ని 1-1తో డ్రాగా ముగించడం ద్వారా భారత్ తమ గ్రూప్లో మూడోస్థానంలో నిలిచింది. భారత్ మొత్తం 8 మ్యాచ్లాడి 7 పాయింట్లు దక్కించుకుంది. అఫ్ఘాన్ 6 పాయింట్లతో సరిపెట్టుకుంది. టీమిండియా ఇప్పుడు మూడో రౌండ్ చేరడం ద్వారా 2023 ఆసియాకప్ అర్హత బరిలో నిలిచేవుంది. కాగా అఫ్ఘానిస్థాన్తో మ్యాచ్లో భారత్ ఒక్కగోల్ కూడా చేయలేదు. 75వ నిమి షంలో అఫ్ఘాన్ గోల్ కీపర్ చేసిన పొరపాటువల్ల ఆ జట్టు సెల్ఫ్ గోల్ చేసిం ది. ఆ తర్వాత 81వ నిమిషంలో గోల్ చేసి అఫ్ఘాన్ ఓటమి తప్పించుకుంది.