పాక్ మహిళా జట్టు కెప్టెన్ బిస్మా మరూఫ్ కుమార్తెతో మిథాలీ జట్టు సెల్ఫీలు
ABN , First Publish Date - 2022-03-07T02:42:42+05:30 IST
ఐసీసీ మహిళా ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్తో నేడు (ఆదివారం) జరిగిన మ్యాచ్లో భారత జట్టు ఘన విజయం
మౌంట్ మాంగనూయి: ఐసీసీ మహిళా ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్తో నేడు (ఆదివారం) జరిగిన మ్యాచ్లో భారత జట్టు ఘన విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా క్రికెటర్లు షేర్ చేసిన వీడియో అందరినీ ఆకర్షించింది. పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్ నెలల కుమార్తెను మన క్రికెటర్లు ముద్దు చేస్తున్న వీడియో అది. పాక్ జర్నలిస్టు కూడా ఇందుకు సంబంధించిన ఫొటోను, వీడియోను షేర్ చేశారు.
మరూఫ్ కుమార్తెతో భారత క్రికెటర్లు సెల్ఫీలు తీసుకున్నారు. ఆపై ఆ చిన్నారితో ఆడుకుంటూ కనిపించారు. మైదానంలో ఇరు జట్లు భీకరంగా తలపడినా బయటమాత్రం తాము మంచి స్నేహితులమని నిరూపించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్ల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.