దేశంలో 4,868కు చేరిన ఒమైక్రాన్ కేసులు
ABN , First Publish Date - 2022-01-12T15:08:18+05:30 IST
కరోనా, ఒమైక్రాన్ వేరియంట్ వైరస్లు దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
న్యూఢిల్లీ: కరోనా, ఒమైక్రాన్ వేరియంట్ వైరస్లు దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా కేసులు రెండు లక్షలకు చేరువలో ఉండగా.. ఒమైక్రాన్ కేసులు ఐదు వేలకు చేరువలో ఉన్నాయి. దేశంలో 4,868 ఒమైక్రాన్ కేసులు నమోదు అవగా... 1,805 మంది ఒమైక్రాన్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలో అత్యధికంగా 1,281 కేసులు నమోదు అయ్యాయి.
అలాగే రాష్ట్రాల వారీగా ఒమైక్రాన్ కేసులు:
రాజస్థాన్లో 645
ఢిల్లీలో 546
కర్నాటకలో 479
కేరళలో 350
పశ్చిమ బెంగాల్లో 294
ఉత్తరప్రదేశ్లో 275
గుజరాత్లో 236
తమిళనాడులో 185
హర్యానాలో 162
తెలంగాణలో 123
ఒడిశాలో 102
ఆంద్రప్రదేశ్లో 54
బీహార్లో 27
పంజాబ్లో 27
గోవాలో 21
జమ్మూకాశ్మీర్లో 13
మధ్యప్రదేశ్లో 10