Indiaలో 2,135కి చేరిన ఒమైక్రాన్ కేసులు

ABN , First Publish Date - 2022-01-05T15:22:39+05:30 IST

ఓ వైపు కరోనా కేసులు... మరోవైపు ఒమైక్రాన్ వేరియంట్ దేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

Indiaలో 2,135కి చేరిన ఒమైక్రాన్ కేసులు

న్యూఢిల్లీ: ఓ వైపు కరోనా కేసులు... మరోవైపు ఒమైక్రాన్ వేరియంట్ దేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రోజువారీ కరోనా కేసులు 50వేలు దాటుతుండగా... ఒమైక్రాన్ వేరియంట్ కేసులు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఒమైక్రాన్ కేసుల సంఖ్య 2,135కి చేరింది. అలాగే ఒమైక్రాన్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 828గా ఉంది. రాష్ట్రాల వారీగా ఒమైక్రాన్ కేసులు ఈ విధంగా ఉన్నాయి.  మహారాష్ట్ర 653, ఢిల్లీ 464, కేరళ 185, రాజస్థాన్ 174, గుజరాత్ 154, తమిళనాడు 121, తెలంగాణ 84, కర్ణాటక 77, హర్యానా 71 ,ఒడిశా, ఉత్తరప్రదేశ్ 31, ఆంధ్ర ప్రదేశ్ 24, వెస్ట్ బెంగాల్ 20 , మధ్యప్రదేశ్ 9 ,ఉత్తరాఖండ్ 8, గోవా 5  కేసులు నమోదు అయ్యాయి. 

Updated Date - 2022-01-05T15:22:39+05:30 IST