భారత్‌లో 3007కి చేరిన Omicron కేసులు

ABN , First Publish Date - 2022-01-07T15:35:21+05:30 IST

దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా లక్ష దాటిపోగా ఒమైక్రాన్ వేరియంట్ కేసులు కూడా మూడు వేలకు చేరువయ్యాయి.

భారత్‌లో 3007కి చేరిన Omicron కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా లక్ష దాటిపోగా ఒమైక్రాన్ వేరియంట్ కేసులు కూడా మూడు వేలకు చేరువయ్యాయి. దేశ వ్యాప్తంగా ఒమైక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 3,007కి చేరింది. ఒమైక్రాన్ వేరియంట్ బారిన పడి కోలుకుని డిశ్చార్జ్ అయిన సంఖ్య 1,199గా ఉంది. మరోవైపు ఒమైక్రాన్ వేరియంట్ కేసులు రాష్ట్రాల వారిగా ఈ విధంగా ఉన్నాయి. మహారాష్ట్రలో 876, ఢిల్లీలో 465, కర్ణాటకలో 333,  రాజస్థాన్లో 291,  కేరళలో 284,  గుజరాత్‌లో 204,  తమిళనాడులో 121,  హర్యానాలో 114,  తెలంగాణలో 107,  ఒడిస్సాలో 60,  ఉత్తరప్రదేశ్‌లో 31,  ఆంధ్రప్రదేశ్‌లో 28,  వెస్ట్ బెంగాల్‌లో 27,  గోవాలో 19,  అస్సాంలో తొమ్మిది,  మధ్యప్రదేశ్‌లో 9,  ఉత్తరాఖండ్‌లో 8 కేసులు నమోదు అయ్యాయి. 

Updated Date - 2022-01-07T15:35:21+05:30 IST