భారత్‌లో 781కి చేరిన ఒమైక్రాన్ కేసులు

ABN , First Publish Date - 2021-12-29T16:23:02+05:30 IST

దేశంలో ఒమైక్రాన్ వేరియంట్ వ్యాప్తి కొనసాగుతోంది.

భారత్‌లో 781కి చేరిన ఒమైక్రాన్ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో ఒమైక్రాన్ వేరియంట్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశంలో 781 ఒమైక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. వారిలో 241 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఒమైక్రాన్ వేరియంట్ కేసుల్లో మొదటి స్థానంలో ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. మొదటి స్థానంలో ఢిల్లీ 238 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మహారాష్ట్రలో 167, గుజరాత్‌లో 73, కేరళలో 65, తెలంగాణలో 62, రాజస్థాన్‌లో 46, కర్ణాటకలో 34, తమిళనాడులో 34, హర్యానాలో 12, బెంగాల్‌లో 11 మధ్యప్రదేశ్‌లో 9 ఒమైక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. 

Updated Date - 2021-12-29T16:23:02+05:30 IST