తొలి టీ20 మ్యాచ్లో న్యూజీలాండ్పై నెగ్గిన భారత్
ABN , First Publish Date - 2021-11-18T04:11:59+05:30 IST
జైపూర్: T20 టోర్నీ తొలి మ్యాచ్లో భారత్ న్యూజీలాండ్పై విజయం సాధించింది.
జైపూర్: T20 టోర్నీ తొలి మ్యాచ్లో భారత్ న్యూజీలాండ్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 165 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 166 పరుగులు సాధించింది. రిషబ్ పంత్ 17 పరుగులు చేశాడు. వెంకటేశ్ అయ్యర్ 4, శ్రేయస్ అయ్యర్ 5, సూర్యకుమార్ యాదవ్ 62, రోహిత్ శర్మ 48, కేఎల్ రాహుల్ 15 పరుగులు చేసి అవుటయ్యారు.
అంతకు ముందు కివీస్ ఆటగాళ్ళు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేశారు. కివీస్ ఆటగాళ్ళలో ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ (70) పరుగులు, మార్క్ చాప్మేన్ (63) పరుగులు చేశారు. డారెల్ మిషెల్, గ్లెన్ ఫిలిప్స్ డకౌట్ కాగా శాంట్నర్ (4), కెప్టెన్ టిమ్ సౌథీ నాటౌట్గా నిలిచారు. టీమిండియా బౌలర్లు భువనేశ్వర్, అశ్విన్ చెరి 2 వికెట్లు, చాహర్, సిరాజ్ చెరొక వికెట్ పడగొట్టారు.