పది ఓవర్లలో భారత్ స్కోరు: 85/1

ABN , First Publish Date - 2021-11-18T03:16:34+05:30 IST

జైపూర్: సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో న్యూజీలాండ్‌తో జరుగుతున్న T20 టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్ పది ఓవర్లలో

పది ఓవర్లలో భారత్ స్కోరు: 85/1

జైపూర్: సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో న్యూజీలాండ్‌తో జరుగుతున్న T20 టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్ 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 85 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 22, రోహిత్ శర్మ 43 పరుగులు చేశారు. కేఎల్ రాహుల్ 15 పరుగులు చేసి అవుటయ్యాడు. అంతకు ముందు కివీస్ ఆటగాళ్ళు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేశారు. కివీస్ ఆటగాళ్ళలో ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ (70) పరుగులు, మార్క్ చాప్‌మేన్ (63) పరుగులు చేశారు. డారెల్ మిషెల్, గ్లెన్ ఫిలిప్స్ డకౌట్ కాగా శాంట్నర్ (4), కెప్టెన్ టిమ్ సౌథీ నాటౌట్‌గా నిలిచారు. టీమిండియా బౌలర్లు భువనేశ్వర్, అశ్విన్ చెరి 2 వికెట్లు, చాహర్, సిరాజ్ చెరొక వికెట్ పడగొట్టారు. 



Updated Date - 2021-11-18T03:16:34+05:30 IST