South Africa vs India: విజయానికి మూడు వికెట్ల దూరంలో ఇండియా
ABN , First Publish Date - 2021-12-30T21:21:52+05:30 IST
దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు విజయానికి మూడు వికెట్ల దూరంలో నిలిచింది. ఐదో రోజు లంచ్..
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు విజయానికి మూడు వికెట్ల దూరంలో నిలిచింది. ఐదో రోజు లంచ్ బ్రేక్ సమయానికి సఫారీ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా 123 పరుగులు అవసరం కాగా, కోహ్లీ సేన విజయానికి మూడు వికెట్లు చాలు. ఇంకా 73 ఓవర్లు మిగిలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత జట్టు విజయం నల్లేరు మీద నడకే కానుంది. ప్రస్తుతం క్రీజులో మార్కో జాన్సేన్ 5, తెంబా బవుమా 34 పరుగులతో క్రీజులో ఉన్నారు.