లక్ష్య ఛేదనలో ఓపెనర్లను కోల్పోయిన టీమిండియా

ABN , First Publish Date - 2022-07-18T01:44:24+05:30 IST

ఇంగ్లండ్ నిర్దేశించిన 260 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌ 21 పరుగులకే రెండు కీలక

లక్ష్య ఛేదనలో ఓపెనర్లను కోల్పోయిన టీమిండియా

మాంచెస్టర్: ఇంగ్లండ్ నిర్దేశించిన 260 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌ 21 పరుగులకే రెండు కీలక వికెట్లను చేజార్చుకుంది. శిఖర్ ధవన్ మరోమారు దారుణంగా విఫలమయ్యాడు. మూడో ఓవర్ తొలి బంతికే ఓపెనర్ శిఖర్ ధవన్ అవుటయ్యాడు. మూడు బంతులు ఆడిన ధవన్ ఒక్క పరుగు మాత్రమే చేసి టోప్లీ బౌలింగులో జాసన్ రాయ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.


ఆ తర్వాత కాసేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టోప్లీకే చిక్కి పెవిలియన్ చేరాడు. 17 బంతుల్లో 4 ఫోర్లతో 17 పరుగులు చేసిన రోహిత్ 21 పరుగుల వద్ద రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిశాయి. టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. కోహ్లీ 12, రిషభ్ పంత్  2 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

Updated Date - 2022-07-18T01:44:24+05:30 IST